ఉదయం పేపర్ చూడగానే ఒక వార్త నన్ను ఆలోచనలోకి నెట్టింది. "భారత్
పాకిస్తాన్ మధ్య పోరు (war), ఐతిహాసికం"
చదవగానే ఏదో కలవరం. ఏదో రెండు దేశాల మధ్య యుద్ధం జరిగిపోతున్నట్లు రాసారు. ఇంక టివి
ఛానల్ వాళ్ళు సరేసరి. ప్రపంచ కప్ ఆటల పోటీ లా లేనేలేదు. భారత్ బ్యాట్స్ మన్ కి పాక్ బౌలర్ కి మధ్య యుద్ధం అని ఏదో వ్యక్తిగత
కక్ష ఉన్నట్లుగా రాసిన కథానిక చదివి కొంచం బాధ కొంచం భయం కూడా కలిగాయి.
ఒక స్నేహితుని దగ్గరనుండి ఫోను వచ్చింది పూజ చేశావా అంటూ. ఏదైనా పర్వదినామా
నేను మర్చిపోయానా అనే అనుమానం కలిగింది నాకు. ఏమిటి విశేషం? ప్రత్యేక పూజ ఏమీ చేయలేదే అన్నాను నేను.
అదేంటి క్రికెట్ మ్యాచ్ కదా, భారత్ గెలవాలని పూజ చేయలేదా
అని. కనీసం ప్రార్థన అయినా చేయి భారత్ గెలవాలి. ఏదో పరీక్ష రాయడానికి
వెళ్తున్నట్టు ఒకళ్ళకి ఒకరు అల్ ద బెస్ట్ అంటూ విష్ చేసుకోవడం అయితే చాలా
ఆశ్చర్యాన్ని కలిగించింది.
ఈ మ్యాచ్ తో ప్రజలు చాలా రకాలుగా ముడిపడి ఉన్నారు. ఖాళీ స్థలాల్లో పందిళ్ళు
వేసి పెద్ద పెద్ద స్క్రీన్ లు పెట్టి టిక్కెట్లు అమ్మినవాళ్లు కొందరైతే ఉదయం నుండి బార్లు తెరిచి కూర్చున్నవారు కొందరు.
ఒక టివి ఛానల్ వాళ్ళు అమితాభ్ బచన్ ని తెస్తే వేరే ఛానల్ వాళ్ళు ఇంకో సెలెబ్రేటి
ని తెచ్చారు. సినిమాకి వెళ్దామని బుక్ మై షో ఓపెన్ చేస్తే మొన్న శుక్రవారం విడుదల అయిన
సినిమా కి హాల్ అంతా ఖాళీ. ఎప్పుడూ ట్రాఫిక్ తో కిక్కిరిసిపోయే వీధులు
నిర్మానుష్యం. అన్నికంటే వింత అయిన విశేషం ఏమిటంటే ఒక పెళ్ళికి వెళ్లవలసి వచ్చి వేదిక
చూద్దామని శుభలేఖ తెరిచిన నాకు ఆశ్చర్యానికి అమ్మమ్మ లాంటిది ఏదో కలిగింది. అది ఏమిటంటే
శుభలేఖ లో గమనిక: భారత్ పాకిస్తాన్ క్రికెట్ మ్యాచ్ ప్రత్యక్ష ప్రసారం చూపబడును
అని వేశారు. పెళ్ళికి ఎవరూ రారేమో అనే గాబరా వాళ్ళది. పెళ్లి వేదికలో తెరలు పెట్టి
మరీ క్రికెట్ మ్యాచ్ ప్రత్యక్ష ప్రసారం చూపించారు పెళ్ళివారు.
సాయంత్ర సమయంలో దీపావళి సంబరాలు. మ్యాచ్ మంచి రసవత్తరం గా లేదని కొందరిలో అసంతృప్తి
ఉన్నా ఘనవిజయ సంబరాలను అందరూ జరుపుకున్నారు.
సమాంతర వినోదం గా ఫేస్ బుక్ ఇంకా వాట్స్ ఆప్ లో మ్యాచ్ కి ముందు మ్యాచ్
జరుగుతున్న సమయంలో ఇంకా మ్యాచ్ అయిన తరువాత వచ్చిన జోక్ లకి ప్రజల సృజన, సమయస్ఫూర్తి లకు చక్కని వేదిక దొరికింది అనిపించింది.
ఎవరి పిచ్చి వారిది
ReplyDeleteఎవరి పిచ్చి వారిది
ReplyDelete